Saturday 1 April 2017

ఇవాళ్టి నుంచి తగ్గే పెరిగే వస్తువుల ధరలు

ఇవాళ్టి నుంచి తగ్గే పెరిగే వస్తువుల ధరలు

ఇవాళ్టి నుంచి తగ్గే పెరిగే వస్తువుల ధరలు

ఆర్ధిక సంవత్సరం శనివారం నుంచే మొదలు కానుంది. 2017-18 ఆర్థిక సంవత్సరానికిగాను అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రత్యక్ష, పరోక్ష పన్నులను రివైజ్‌ చేశారు. అవి శనివారం నుంచి అమల్లోకి రానున్నాయి. వాటి ప్రకారం కొన్ని వస్తువుల రేట్లు పెరగనున్నాయి..మరి కొన్ని వస్తువుల రేట్లు తగ్గనున్నాయి.

పెరిగేవి..

సిగరెట్లు, పాన్ మసాల, పేపరు చుట్టిన, చేతితో తయారు చేసిన బీడీలు, పొగాకు ఉత్పత్తులు, ఎల్ ఈడీ దీపాల విడిభాగాలు, వెండి పతకాలు, 99.9%స్వచ్ఛత ఉన్న వెండి నాణేలు, సాల్టెడ్‌ జీడి పప్పు ధరలు పెరగనున్నాయి, భారత్‌లో తయారయ్యే మొబైల్‌ఫోన్లు, ఫోన్లలో వాడే ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డు(పీసీబీ)లను ఫోన్‌ తయారీ కంపెనీలు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. భారతలో తయారీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం.. అలా దిగుమతి చేసుకునే పీసీబీలపై ప్రత్యేక అదనపు డ్యూటీ విధించింది.కార్లు,మోటారు సైకిళ్ల బీమా ఇవాళ్టి నుంచి పెరగనుంది.

తగ్గేవి…

సౌర శక్తితో పనిచేసే ఉపకరణాలు, ఇళ్లల్లో వాడే ఆర్వో వాటర్‌ ఫిల్టర్లు, వాటిలోని ఆర్వో కాంపొనెంట్ల డ్యూటీ రేట్లు త గ్గించినందున వాటి ధరలు తగ్గనున్నాయి. ఆన్ లైన్ రైల్వే టికెట్లు, లెదర్ తో తయారయ్యే ఉత్పత్తుల్లో కొన్ని వస్తువులు, పీఓఎస్ యంత్రాలు/ కార్డులు, ఫింగర్ ఫ్రింట్స్ ఆధారంగా పని చేసే యంత్రాలు, రక్షణ బలగాలకు వర్తించే సామూహిక బీమాకు సంబంధించినవి తగ్గనున్నాయి.

 

Mirchi Today

Author & Editor

Has laoreet percipitur ad. Vide interesset in mei, no his legimus verterem. Et nostrum imperdiet appellantur usu, mnesarchum referrentur id vim.

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...