నూతనంగా ఏర్పడిన జిల్లాల్లో ఐదు జిల్లాల పేర్లను మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భద్రాద్రి జిల్లాను భద్రాద్రి కొత్తగూడెం, గద్వాల జిల్లాను జోగులాంబ గద్వాల, యాదాద్రి జిల్లాను యాదాద్రి భువనగిరిగా పేర్లు మార్చింది. కొమురం భీం జిల్లా పేరును కుమురం భీం జిల్లాగా పేరు మార్చారు. రాజన్న జిల్లా పేరును రాజన్న సిరిసిల్ల జిల్లాగా మార్చారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది. కేటీ దొడ్డి మండలంలోకి ఏపీకొండనహల్లి గ్రామం చేర్చింది. గట్టు మండలంలోకి ముస్లీంపల్లె గ్రామం, ఉండవల్లి మండలంలోకి శాలిపూర్, ఖానాపూర్ గ్రామాలు, మనోపాడ్ మండలంలోకి మంగపేట, రాయిమాకులకుంట్ల, పొసలపాడు గ్రామాలు చేర్చారు.
Tuesday 24 January 2017
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment