TS Govt removed 60% degree pass eligibility
గురుకుల నోటిఫికేషన్ లో 60 శాతం మార్కులు ఉండాలనే నిబంధన తొలగించాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. NCERT మార్గదర్శకాల ప్రకారం డిగ్రీలో 50 శాతం మార్కులు ఉన్నా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలన్నారు. కచ్చితంగా 60 శాతం ఉండాలనే నిబంధన తొలగించాలని ఆదేశించారు. నిరుద్యోగులు ఎక్కువ మందికి పరీక్ష రాసే అవకాశం కల్పించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 3 ఏళ్ల బోధనా అనుభవం ఉండాలన్న నిబంధన కూడా తొలగించడంతో పాటు … డిగ్రీ, బీఈడీ, టెట్ అర్హత ఉన్నవారందరికీ ఎలాంటి అనుభవం లేకపోయిన దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వాలని సూచించారు సీఎం. తెలుగు మీడియంలో ఎగ్జామ్ నిర్వహించాలన్న విజ్ఞప్తిపై సీఎం సమీక్షించారు. గురుకుల నోటిఫికేషన్ తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాసే నిబంధన లేకపోవడంతో ఇంగ్లీస్ లోనే పరీక్ష రాయలని సూచించారు సీఎం.
0 comments:
Post a Comment